శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి మరియు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థి ప్రతినిధులు గవర్నర్ డాక్టర్ తమిళి సై ని కలిసి ‘జై జవాన్ జై కిసాన్’అంటూ సైనికులకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం విద్యార్థుల తరఫున మరియు విద్యాసంస్థల తరఫున సేకరించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై విద్యార్థులు మరియు యాజమాన్యానికి అభినందనలు తెలిపి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యా సంస్థలు యాజమాన్యం మరియు విద్యార్థులు వరుసగా మూడోసారి సైనికులకు రైతులకు మద్దతుగా విరాళం అందజేసినందుకు డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ జి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే సైనికులను, భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహారాన్ని ఇతర పంటలను పండించి నిరంతరం కష్టం చేసే రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం మరియు విద్యార్థులు వారి సహాయార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…