– అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం
– మిన్నంటిన కోలాహలం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా విచ్చేసిన విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జి. వంశీకృష్ణ ఫెస్ట్ ను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. లింగ భేదం లేకుండా విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఉపాసన హితవు పలికారు. వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను బట్టి ఆయా రంగాలను ఎంచుకుని, అందులో రాణించాలని వంశీ సూచించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ట్రెజర్ హంట్, డాన్స్ వర్క్ షాప్ , ఆటో ఎక్స్ పో , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ వంటి అనేక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.
వీటికి అదనంగా, వర్క్ షాప్ లు , వివిధ పోటీలు, పాటలు, ర్యాంప్ వాక్, నృత్యాలు వంటి సాంకేతిక-సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి తోడ్పడ్డాయి. కళాకారుల ప్రతిభా ప్రదర్శన విభాగంలో, నేపథ్య గాయకులు రామ్ మిరియాల, సాహితీ చాగంటి సినీ పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్ టీఈ డేటా ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, పలు పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
ఇక చివరి రోజు ప్రాజెక్ట్ 91, నినా సుర్దాతో కూడిన డీజే నెట్తో ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంగీత యాత్రను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని, తమ ప్రతిభా, నెపుణ్యాలను ప్రదర్శించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణ, మార్గదర్శనంలో రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో సిరిల్ పొడిపర, పలువురు అధ్యాపకులు, కోర్ కమిటీ ఈ ఫెస్ట్ ను పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తయ్యేలా కృషిచేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…