పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అధునాతన పరిజ్జానాలైన కృత్రిమమేథ (ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)లను భారతీయులు కూడా అందిపుచ్చుకోవాలని, అత్యంత ఖర్చు, వ్యయప్రయాసలతో కూడినదైనా దానిని వదులుకోకూడదని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లో బుధవారం ఆమె పలు అంతర్దృష్టులను పంచుకున్నారు.
రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్ తన పైలట్ పరిశోధన అధ్యయనం ప్రారంభ ఫలితాలను సదస్యులకు వివరించారు. ముఖ్యంగా, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి రెండు కీలక కేస్ స్టడీలను ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ, తెలంగాణలో కృత్రిమ మేథ యొక్క సంక్లిష్ట దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఈ స్థానిక ఉదాహరణలను జాతీయ, అంతర్జాతీయ ఏఐ అభివృద్ధి యొక్క విస్తృత చట్రాలలో పరిశీలించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో తెలంగాణ పథం యొక్క క్లిష్టమైన విశ్లేషణలను డాక్టర్ రఘునాథ్ అందించారు. జీవనోపాధి, అభివృద్ధి మధ్య సంక్లిష్ట పరస్పర చర్య, సామాజిక-పర్యావరణ పరిగణనలు, దక్షిణ అర్ధగోళంలో (గ్లోబల్ సౌత్) అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క చిక్కులను వివరించారు.
ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి మధ్య సమతుల్యత, ఏఐ ప్రపంచ కథనంలో స్థానిక సందర్భాలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతలను ప్రస్తావించారు. చారిత్రక వ్యాపారం-సాంకేతిక కథనాలను గుర్తించడం, యూరో-అమెరికన్ దృక్కోణాలను దాటి వెళ్లడం, సాంకేతిక పురోగతిలో ప్రత్యక్ష అనుభవాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని ఆహ్వానించి, విద్యార్థులకు పరిచయం చేశారు. కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ జి.అశోక్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…