Telangana

మార్పును అందిపుచ్చుకోండి

వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులకు ప్రొఫెసర్ కరుణాకర్ సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ 5.0 దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్ అపారమైన మార్పులకు గురైందని, ఆ మార్పును అందిపుచ్చుకుని విజయ తీరాలను చేరుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) సెంటర్ ఫర్ కేస్ స్టడీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు. జీఎస్బీలోని మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యాపార వృద్ధి కోసం సామాజిక-వాణిజ్యంలో కత్రిమ మేధస్సును ప్రభావంతంగా వినియోగించడం’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ)ని గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ సహా ఆటోమేషన్, రోబోటిక్స్ సాంప్రదాయ వ్యాపార నమూనాలను సమూలంగా మారుస్తున్నాయన్నారు. ఆయా అంశాలపై మంచి అవగాహన కల్సించేందుకు ఏర్పాటుచేసిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులు, మార్కెటర్లు, మేనేజర్లు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, అనధికారిక రంగాలలో పనిచేస్తున్న వారితో సహా విభిన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ యాజమాన్య వికాస కార్యక్రమాన్ని రూపొందించారు. ఏఐ వారి సామాజిక-వాణిజ్య వ్యూహాలను ఎలా విప్లవాత్మకంగా మార్చగలదో, సంబంధిత సంస్థలలో స్థిరమైన వృద్ధిని వారు ఎలా సాధించగలరో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. వ్యాపార కార్యకలాపాలను వృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనున్నది. ఇందులో పాల్గొన్న వారికి ఆయా అంశాలపై విస్తృత అవగాహన ఏర్పరచడమే గాక, ఇతర సంస్థల ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తోంది.ఈ ప్రారంభోత్సవంలో ఎండీపీ నిర్వాహకుడు ప్రొఫెసర్ యు.దేవీప్రసాద్, మార్కెటింగ్ చైర్ డాక్టర్ దేవిక రాణి శర్మ, పలువురు అధ్యాపకులు, దాదాపు 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago