Telangana

దొంగ ధర్నాలన్నీ కాంట్రాక్టర్ల కోసమే కదా?_బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్  మీ మద్దతు రైతులకా? లేక మీ కాంట్రాక్టర్లకా అంటూ ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ యువరాజు ధర్నాకు పిలుపు ఇవ్వగానే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ సమస్యపైన ధర్నా చేయాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అసలు మీరు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం రైతులకు, రైతు కూలీలకు పంటలు పండించే అవకాశం లేనప్పుడు వారికి వచ్చే నిధులను దారి మళ్లించి.. వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మీరు ధర్నాలు రైతుల కోసం చేస్తున్నారా? కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారా? అని నిలదీశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు కాంట్రాక్టులు పేరుతో.. సీసీ రోడ్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. మీ క్రషర్ల వల్ల నియోజకవర్గంలోని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని.. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ పథకంలో వచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాలుష్యం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల వలన పరిష్కారం కోసం బాధితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, కోర్టు ద్వారా వారికి కొంత నగదును ఇవ్వాలని తీర్పు వచ్చిందన్నారు.

సంవత్సరాలు గడుస్తున్నా వారికి న్యాయం చేయలేని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కూడా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులకు రైతుల పక్షాన ధర్నాలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇంకోసారి ధర్నాలు చేస్తే భారతీయ జనతాపార్టీ తరపున అడ్డుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్‌రాజ్, ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు షకీల్,‌ దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago