రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి :
ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో పరిధిలోని పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశంలో అనేక మతాలవారు, అనేక ప్రాంతాల వారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్న ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.
దేశంలో ఉండే ప్రజలందరూ మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా.. సంస్కృతి సాంప్రదాయాలు వేరైనా కలిసిమెలిసి జీవించి ఉండటం గొప్ప విషయంగా చెప్పారు. పండగ ఏ మతం వారిదైనా భారత దేశంలో ప్రజలందరూ ఐక్యమత్యంతో జరుపుకుంటామన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి క్రిస్టియన్స్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ ఖదీర్, శివకుమార్, కిషోర్, శంకర్, సలీం, జబ్బర్, సయ్యద్ ఇర్ఫాన్, అస్సలామ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…