పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 మంది బీటెక్ సీఎస్ఈ , బీఫార్మశీ విద్యార్థులు పాల్గొని , ఇన్నోవియన్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్టు ఆమె తెలియజేశారు . వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి పోటీలను నిర్వహించి విజేతలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను పంపిణీ చేశామన్నారు . ఈ కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు ఆరూడియో వినియోగం , ఆర్ ప్యాకేజిని ఉపయోగించడంతో పాటు రియల్టైమ్ ప్రాజెక్టులయిన కోవిడ్ , జొమాటో డేటాలను విశ్లేషించినట్టు అరుణశ్రీ తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…