_లోగో ఆవిష్కరణలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
_ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక, యాజమాన్య (టెక్నో, కల్చరల్, మేనేజ్మెంట్ ఫెస్ట్) పండుగ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ సి.త్రినాథరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫెస్ట్ ప్రచారంలో భాగంగా, నవీకరించిన లోగోను ఇటీవల ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. ప్రమాణ లోగో ఆవిష్కరణ సందర్భంగా గీతం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు (శాస్త్రీయ, జానపద, సామూహిక నృత్యాలను) ప్రదర్శించినట్టు ఆయన పేర్కొన్నారు. ట్రయాడ్ బ్యాండ్ ప్రదర్శన ఈ ఉత్సవానికే తలమానికంగా నిలిచి, ఆహూతులందరినీ అలరించిందన్నారు.లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో దాదాపు 1500 మంది గీతం విద్యార్థులు చురుకుగా పాల్గొని, ప్రమాణ-2024 ఉత్సవ నిర్వహణ కోసం తమ ఉత్సుకతను ప్రదర్శించినట్టు డాక్టర్ త్రినాథరావు తెలియజేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని స్టూడెంట్ లెఫ్ట్ బృందం పర్యవేక్షించి, సమన్వయం చేసిందన్నారు.గీతం, హైదరాబాద్ సాంకేతిక, సాంస్కృతిక, మేనేజ్మెంట్ వేడుకల కోసం వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఒకచోట చేర్చి, ఆకర్షణీయమైన, మరపురాని ప్రమాణ 2024ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…