Telangana

గీతం ప్రమాణ ఫిబ్రవరి 8-10న

_లోగో ఆవిష్కరణలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

_ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక, యాజమాన్య (టెక్నో, కల్చరల్, మేనేజ్మెంట్ ఫెస్ట్) పండుగ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ సి.త్రినాథరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫెస్ట్ ప్రచారంలో భాగంగా, నవీకరించిన లోగోను ఇటీవల ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. ప్రమాణ లోగో ఆవిష్కరణ సందర్భంగా గీతం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు (శాస్త్రీయ, జానపద, సామూహిక నృత్యాలను) ప్రదర్శించినట్టు ఆయన పేర్కొన్నారు. ట్రయాడ్ బ్యాండ్ ప్రదర్శన ఈ ఉత్సవానికే తలమానికంగా నిలిచి, ఆహూతులందరినీ అలరించిందన్నారు.లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో దాదాపు 1500 మంది గీతం విద్యార్థులు చురుకుగా పాల్గొని, ప్రమాణ-2024 ఉత్సవ నిర్వహణ కోసం తమ ఉత్సుకతను ప్రదర్శించినట్టు డాక్టర్ త్రినాథరావు తెలియజేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని స్టూడెంట్ లెఫ్ట్ బృందం పర్యవేక్షించి, సమన్వయం చేసిందన్నారు.గీతం, హైదరాబాద్ సాంకేతిక, సాంస్కృతిక, మేనేజ్మెంట్ వేడుకల కోసం వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఒకచోట చేర్చి, ఆకర్షణీయమైన, మరపురాని ప్రమాణ 2024ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago