పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 34వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 34 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న మైత్రి క్రికెట్ క్లబ్ ను ఆయన ప్రశంసించారు. ఇటీవల ఏడు కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి మైత్రి క్రీడా మైదానాన్ని ఆధునిక వసతులతో ఆధునికరించామని తెలిపారు. ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, ఎస్సార్ గ్రూప్స్ ఎం డి లు కే. సత్యనారాయణ రెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, ఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి,శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, క్రికెట్ క్లబ్ సభ్యులు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…