Hyderabad

టిఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గ ప్రకటన

పార్టీ పటిష్టతకు సైనికుల వలే కృషి చేయాలి
ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సైనికుల వలె కృషిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్త ను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో విద్యార్థి, యువజన విభాగాల దే కీలక పాత్ర అన్నారు. కష్ట పడిన ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో యువత మత్తుకు బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు అప్రమత్తంగా ఉండి, సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత ఈ రెండు విభాగాలపై ఉందన్నారు.

నియోజకవర్గ స్థాయిలో క్రీడారంగానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, నూతన స్టేడియాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ స్థాయి యువజన విభాగం అధ్యక్షులు గా శ్యాంసుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా చెన్నారెడ్డి లు ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గలోని నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల నూతన కార్యవర్గలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, సోమిరెడ్డి, విజయ్ కుమార్, గూడెం విక్రమ్ రెడ్డి, మెరజ్ ఖాన్, కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago