Hyderabad

నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి :

నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన నిర్మాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

హెచ్ఎండిఏ పరిధిలో నాలా సమస్యతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమస్య పరిష్కరించాలని నిర్మాణదారులు కోరారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో సాప్ట్ వేర్ అనుసంధానం లో డిలీట్ అయిన ఫైళ్ళను వెంటనే జత చేయాల్సిందిగా అభ్యర్థించారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో బిల్డర్ల పై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రోజురోజుకు పెరుగుతున్న భూముల ధరలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంట్, ఇటుకలు,ఇసక, ఇనుము వంటి మెటీరియల్స్ ధరలు కూడా పెరగడంతో బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్మాణ రంగంపై అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినప్పటికీ కనీసం వడ్డీ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసీపీ ఎండి ఖుద్దుస్ లు మాట్లాడుతూ బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్ప సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎం ప్రేమ్ కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు, సత్యం శ్రీరంగం, చెన్నారెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ,కె వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago