శేరిలింగంపల్లి :
నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన నిర్మాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
హెచ్ఎండిఏ పరిధిలో నాలా సమస్యతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమస్య పరిష్కరించాలని నిర్మాణదారులు కోరారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో సాప్ట్ వేర్ అనుసంధానం లో డిలీట్ అయిన ఫైళ్ళను వెంటనే జత చేయాల్సిందిగా అభ్యర్థించారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో బిల్డర్ల పై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రోజురోజుకు పెరుగుతున్న భూముల ధరలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంట్, ఇటుకలు,ఇసక, ఇనుము వంటి మెటీరియల్స్ ధరలు కూడా పెరగడంతో బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్మాణ రంగంపై అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినప్పటికీ కనీసం వడ్డీ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసీపీ ఎండి ఖుద్దుస్ లు మాట్లాడుతూ బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్ప సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎం ప్రేమ్ కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు, సత్యం శ్రీరంగం, చెన్నారెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ,కె వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…