హైదరాబాద్
పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికున్న ఆస్తి అమ్ముకుని ఖర్చు పెట్టారు. . ఆసుపత్రి బిల్లులు కట్టడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బీహెచ్ఈఎల్ ఎమ్ఐజి లో నివాసముండే ఆ కుటుంబం పేదరికం వల్ల చిన్నారి ప్రాణహాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ప్రణీత ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉండే రామచంద్రపురం ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది అనురాధ ఈ విషయాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు . దేవేందర్ రాజు సహృదయంతో వెంటనే స్పందించి . మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదలకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న ఈ ఫౌండేషన్ ప్రతినిధులను అందరూ ప్రశంసిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…