Andhra Pradesh

కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

మనవార్తలు ,విజయవాడ:

పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి రూ.22.5లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడి, 50 కిలోల ప్రమాదకర రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేటలో కల్తీ టీపొడి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలియడంతో సోమవారం పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. తొలుత రాచకొండ అనిల్‌, పోకల రమేశ్‌, బూర్ల వినయ్‌కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని వారివద్ద ప్రాణాంతకమైన కల్తీ టీపొడిని గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు

రాజమహేంద్రవరంలోని కృష్ణచైతన్య ఇంట్లో 12 క్వింటాళ్ల కల్తీ టీపొడి, రసాయన రంగుపొడి, ఇతర తయారీ సామగ్రి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదేనగరంలోని జగన్నాథం వెంకట్‌రెడ్డి వద్ద 23 క్వింటాళ్ల టీపొడి, రసాయన రంగుపొడి, కారును పట్టుకున్నారు. విజయవాడలోని కామేశ్వరరావు ఇంట్లో 9.30 క్వింటాళ్ల కల్తీ టీపొడి, రంగుపొడి కనుగొన్నారు. సూర్యాపేటలోని టి.రాము, తోట వెంకటేశ్వర్లు, రాజు, సంతోష్‌, రాజేష్‌, రమేశ్‌, సంపత్‌, లక్ష్మయ్య, వినయ్‌ల నుంచి మొత్తం 129 కిలోల కల్తీ టీపొడిని స్వాధీనపరచుకొని నిందితులను అరెస్టు చేశారు. కల్తీ టీపొడిని కలిపిన వెంటనే నీరు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ఈముఠాను పట్టుకున్న సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందించారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

20 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

22 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago