Hyderabad

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలి_భట్టి

 మనవార్తలు  , హైదరాబాద్‌:

రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే సాయం చేయాలన్నారు. 1,200 మంది అమరులకు న్యాయం చేస్తామంటేనే ఆర్థిక సాయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అని సీఎం కేసీఆర్‌ను భట్టి నిలదీశారు.‘కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషమే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపిన కేసీఆర్‌.. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకుంటున్నారు. దిల్లీపై యుద్ధమే అని మరోసారి అమిత్ షాను కలుస్తానంటున్నారు. మరి ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకుంటారా?యుద్ధం అని చెప్పి సీఎం కేసీఆర్‌ దిల్లీలో ఉన్నారు.

ఇక్కడ రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేకుండా పోయారు. వచ్చిన పంటంత రోడ్లపై వానలో తడుస్తుంది. కేసీఆర్ మాట మీద నిలబడాలి. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకోవద్దు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఏడున్నరేళ్ల నుంచి నీటి వాటా తేల్చలేదని సీఎం అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వమని అడిగితే.. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినా డీపీఆర్‌లు ఇవ్వరు. కేంద్రం-ఏపీ-తెలంగాణకు మధ్య జరుగుతున్న అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago