పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలి
అమీన్పూర్ పురపాలక సంఘం పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
మున్సిపల్ పాలకవర్గం నిరంతర కృషి.. ప్రజల భాగస్వామ్యంతో అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గం వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న అమీన్పూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగిందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ శరవేగంగా విస్తరించడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని తెలిపారు. దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం చూపెట్టడం జరిగిందని తెలిపారు.మున్సిపల్ పరిధిలో 80% పైగా అభివృద్ధి చేశామని పాలకవర్గ సభ్యులు తెలియజేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. పదవులు ఉన్న లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్లో పాల్గొనండి.. పటాన్చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…