Telangana

ఇస్నాపూర్ మున్సిపాలిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించండి : నీలం మధు ముదిరాజ్

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించండి

మంత్రి వివేక్ కు  వినతి పత్రం ఇచ్చిన ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ని ప్రత్యేకంగా పరిగణించి నిధులు కేటాయించాలి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామిని ఇస్నాపూర్ చౌరస్తాలో కలసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు .ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలో గల 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ఆ కాలనీలో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ పోల్స్, త్రాగునీరు, ఇంటి నెంబర్లు మరియు కరెంట్ మీటర్లు, వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు, అలాగే నేషనల్ హైవే నుండి లక్డారం- బ్యాతోల్ – రుద్రారం – ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన 15 కోట్ల నిధుల పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్టు మంత్రి కి ఆయన వివరించారు అలాగే మరికొన్ని నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నారాయణదాసు, మన్నే రాఘవేందర్, వెంకటేష్ నాయక్, అల్లం గారి నర్సింహారెడ్డి, సంగన్న గారి గోపాల్, మంజలి దస్తగిరి, మణికంఠ, నాయకులు వల్లపు వెంకటేష్, మురళి, మహేష్, అనిల్, ప్రవీణ్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago