Telangana

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సూచించిన ఆస్ట్రియాలోని ఏటీ&ఎస్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతికతలను వర్ధమాన ఇంజనీర్లు అందిపుచ్చుకోవాలని ఆస్ట్రియాలోని ఏటీ అండ్ ఎస్ ఏజీలో అప్లికేషన్ ఇంజనీరింగ్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ మొక్కపాటి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నిక్స్’పై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. టూడీ, త్రీడీ, అభివృద్ధి చెందుతున్న ఫోర్ డీ ప్యాకేజింగ్ తో సహా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలలో తాజా పురోగతుల గురించి డాక్టర్ మొక్కపాటి విలువైన సమాచారాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఫోర్ డీ పరిజ్జానం లోని మడత లేదా వంపు ద్వారా అన్ని భాగాలకు విద్యుత్ కనెక్టివిటీని పెంచుతుందన్నారు.

బాల్ గ్రిడ్ అర్రే, చిప్ స్కేల్ ప్యాకేజీ, కోర్ లెస్ ప్యాకేజింగ్ వంటి ఆధునిక ప్యాకేజింగ్ నిర్మాణాలలో ఉపయోగించే అధునాతన బిల్డ్-అప్ మెటీరియల్ లకు పెరుగుతున్న డిమాండ్ ను ఆయన వివరించారు. ప్యాకేజింగ్ పనితీరును మెరుగుపరచడానికి ఫైన్ లైన్, స్పేస్, ఫైన్ వయా పిచ్, క్యూరింగ్, రీఫ్రో సమయంలో తక్కువ వార్ ఫేజ్, అధిక ఇన్సులేషన్ విశ్వసనీయత వంటి కీలక అంశాలను డాక్టర్ మొక్కపాటి వివరించారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ మొక్కపాటి అధునాతన ప్యాకేజింగ్, ఐసీ సబ్ స్ట్రేట్ లలో ఆవిష్కరణలను చర్చించారు. సెమీకండక్టర్ టెక్నాలజీలోని ప్రధాన ధోరణులపై కూడా ఆయన ప్రసంగించారు.

కీలకమైన సాంకేతికాంశాలు, సెమీకండక్టర్ తయారు చేసే ప్రముఖ పరిశ్రమలు, సెమీకండక్టర్ వాల్యూ చెయిన్ పై కృత్రిమ మేధస్సు ప్రభావం పెరగడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ ఉపన్యాసం హై-ఫెర్పార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్ పీసీ) వెనుక ఉన్న ఆర్కిటెక్చర్, భవిష్యత్ ఆవిష్కరణలను నడిపించే సెమీకండక్టర్ చిప్ లతో సహా ముఖ్యమైన పరిశ్రమ మార్పులను డాక్టర్ మొక్కపాటి వివరించారు. భారతదేశంలో విస్తరిస్తున్న సెమీకండక్టర్ తయారీ రంగంపై విలువైన సమాచారాన్ని అందించారు. మైక్రోన్, రెనెసాస్, స్టార్స్, కేన్స్ టెక్నాలజీ, టాటా-పీఎస్ఎంసీ, అదానీ-టవర్ సెమీకండక్టర్ వంటి కంపెనీల కీలక ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థులను ప్రశ్నలడగమని ప్రోత్సహిస్తూ, వాటికి డాక్టర్ మొక్కపాటి సందర్భోచిత జవాబులిచ్చారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి, కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ ఎం.ప్రశాంత రెడ్డి అతిథిని సత్కరించి, ఆయన అమూల్యమైన సమయాన్ని గీతం విద్యార్థుల కోసం కేటాయించి, అధునాతన సాంకేతికతపై అవగాహన పెంచినందుకు కృతజ్జతలు తెలియజేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago