Telangana

ప్రకృతి ఒడిలో సృజనకు పదును

దుర్గం చెరువు వద్ద చార్ కోల్ కార్యశాల నిర్వహించిన గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశాంతమైన ప్రకృతిలో మనస్సు ప్రశాంతంగా ఉండడమే గాక అటు భావుకతతో పాటు ఇటు సృజనాత్మకత పెల్లుబకడం సహజం. ఆ నేపథ్యాన్ని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తనకు అనుకూలంగా మలచుకుంటూ, దుర్గం చెరువు సమీపంలోని పచ్చని అందాలు, చల్లని మలయమారుతాల మధ్య ‘బ్లాంక్ కాన్వాస్ నుంచి మాస్టర్ పీస్ వరకు’ అనే ఇతివృత్తంతో ఒక కార్యశాల నిర్వహించింది. ఇందులో బాలల నుంచి వయోజనుల వరకు, అన్ని వయస్సుల వారు పాల్గొని, తమ సృజనాత్మకతకు పదును పెట్టారు.ఈ కార్యశాల ఉల్లాసభరితమైన, సృజనాత్మక వాతావరణంలో సాగింది. పెయింగ్ వేయడాన్ని నేర్చుకోవడం ఆరంభించిన వారి నుంచి అనుభవజ్జులైన కళాకారుల వరకు అందరూ తరలివచ్చి, చార్ కోల్ డ్రాయింగ్ పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు. వారి ఉత్సాహం, ప్రతిభ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది. గీతం అధ్యాపకుల నుంచి వారికి తగిన మార్గదర్శనం లభించడమే గాక, వారి కళాత్మక ప్రతిభను అన్వేషించడంలో సహాయపడింది.ఈ కళాత్మక సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యశాలలు మున్ముందు మరిన్ని జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని వారు విజ్జప్తి చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago