Telangana

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు

– సైకత శిల్పం ఫోటో ఫ్రేమ్ అందజేసిన రవీందర్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

భారాస ఎమ్మెల్సీ కవితను సీనియర్ నేత రవీందర్ యాదవ్ తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కవిత జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించిన రవీందర్ యాదవ్ కళాకారులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కళాకారులకు, సైకత శిల్పం రూపుదిద్దిన వారికి నూతన వస్త్రాలను అందించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినంను స్వయంగా రవీందర్ యాదవ్ పూరీ తీరాన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత అడిగి తెలుసుకున్నారు. పూరీ జగన్నాథ్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రసాదాన్ని, సైకత శిల్ప ఫోటో ప్రేమ్ ను కవితకు రవీందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో ముందుంటున్నారని రవీందర్ యాదవ్ ను కొనియాడారు. శేరిలింగంపల్లిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో భారాస అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రవీందర్ యాదవ్ వెల్లడించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago