Telangana

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.2014 ధరలను పరిశీలిస్తే 50 శాతం నుండి 200 శాతం పెరిగాయని.గ్యాస్ ధరలు 1200 రూపాయలకు పెంచిదని.ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల లో ఉపాధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని.మోడీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లను తెచ్చి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఒకవైపు పేదల పైన భారాలు మోపుతు మరోవై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు.దళితులకు 3 ఏకరాల భూమి ఏమైందిని ప్రశ్నించారు.డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని.గృహ లక్ష్మి పతకం దర్కాస్తు దారులకు సర్వే చేసి 3 లక్షల రూపాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు,పాండు రంగా రెడ్డి,జార్జ్,శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago