Telangana

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.2014 ధరలను పరిశీలిస్తే 50 శాతం నుండి 200 శాతం పెరిగాయని.గ్యాస్ ధరలు 1200 రూపాయలకు పెంచిదని.ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల లో ఉపాధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని.మోడీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లను తెచ్చి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఒకవైపు పేదల పైన భారాలు మోపుతు మరోవై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు.దళితులకు 3 ఏకరాల భూమి ఏమైందిని ప్రశ్నించారు.డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని.గృహ లక్ష్మి పతకం దర్కాస్తు దారులకు సర్వే చేసి 3 లక్షల రూపాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు,పాండు రంగా రెడ్డి,జార్జ్,శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago