Telangana

ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి పార్టీ లు కూడా ముదిరాజ్ లకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించటం లేదని, కాబట్టి తెలంగాణ రాష్ట్రoలో అత్యదిక జనాభా కలిగిన ముదిరాజ్ ల సమస్యల పై మరియు ముదిరాజ్ ల రిజర్వేష్లపై జరుగుతున్న అన్యాయాల పై ప్రశ్నించాటానికి చైతన్య వేదిక ఎల్లప్పుడు ముదిరాజ్ ల గొంతుకగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ముదిరాజ్ లకు జరుగుతున్న అన్యాయాలపై, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజక వర్గాలలో ముదిరాజ్ ల ఆత్మ గౌరవ రథ చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా మొదటి విడుతలో పరిగి, తాండూరు, కొడంగల్, నారాయణ పేట, మక్తల్, మహబూబ్ నగర్, గద్వాల, కొత్తకోట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలను పర్యటించడం జరిగింది. రెండో విడుతగా షాద్ నగర్, జడ్చర్ల, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ లలో పర్యటన ఉంటుంది. అంతే కాకుండా అక్టోబర్ 1వ తేదీన నాం పల్లి, ఎక్స్ బిషన్ గ్రౌండ్ లో లక్ష మందితో ముదిరాజ్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు కోట్ల పుష్పాలత, వైస్ ప్రెసిడెంట్ కురుమూర్తి, జనరల్ సెక్రెటరీ రమేష్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ నర్సింహులు ముదిరాజ్, కన్వీనర్ సంజయ్ ముదిరాజ్, కో ఆర్డినేటర్ వెంకటేష్ ముదిరాజ్, నవెన్న ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు ప్రేమలత ముదిరాజ్, కార్తిక్ పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago