పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మతపెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో విందుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గత 25 సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు.. సొంత నిధులతో మసీదులు, ఆశిర్ఖానాలు నిర్మించి వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపాడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎఎంసి మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, అఫ్జల్, లియాకత్, హమీద్, అజ్మత్, మోసీన్, మేరాజ్ ఖాన్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…