-పార్టీ శ్రేణులతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
మనవార్తలు ,బొల్లారం:
రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించడం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బొల్లారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు బొల్లారం మున్సిపాలిటీలోని జ్యోతి థియేటర్ ముందు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్ ఆమోదించినందుకు బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , నరసింహ రాజు , నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి, సంపత్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , రమణయ్య , రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ రాజు , చక్రపాణి , దీనానాద్ , శ్రీమన్నారాయణ , రాజారాం, మాజీ వార్డ్ సభ్యులు భాస్కర్ , నరేందర్ , ధర్మారావు , శ్రీనివాస్ , శ్రవణ్ , శ్యామ్, ధన్రాజ్ , నాగరాజు , జగన్ , దిగంబర్ , జయరాం పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…