Telangana

దేశభక్తి స్ఫూర్తితో గీతంలో 77వ గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం (26 జనవరి 2026న) గాంధీ కూడలిలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, దేశభక్తి స్ఫూర్తితో జరుపుకున్నారు. వందేమాతరం ఇతివృత్తంగా, ఆత్మనిర్బర్ భారత్ చొరవతో అనుసంధానించిన ఈ వేడుకలు, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య విలువలు, స్వావలంబన పట్ల జాతి నిబద్ధతను ప్రతిబింబించాయి.ఉదయం 9.00 గంటలకు గీతం హైదరాబాదు ఆదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ నిర్మాణంలో విద్యా సంస్థల కీలక పాత్రను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. సాంకేతికత, ఆవిష్కరణలు, నిరంతర శ్రేష్ఠత ద్వారా దేశ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు పోషించే కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తాము ఎంచుకున్న రంగాలలో ప్రపంచ స్థాయి ఫలితాలను సాధించడానికి దృష్టి కేంద్రీకరించి, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బందితో పాటు ఎన్ సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. గీతం విద్యార్థి విభాగాలైన కళాకృతి, అన్వేష క్లబ్బుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన బిహు నృత్యం ఆహూతులను అలరించాయి. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, భద్రతా సిబ్బందికి వారి అంకితభావ సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.గీతం స్టూడెంట్ లైఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమం తేనేటి విందుతో ముగిసింది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారందరినీ ఐక్యంగా, దేశభక్తితో ఈ వేడుకలు ఏకం చేశాయి.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

54 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago