Telangana

మియాపూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వైభవంగా గణతంత్ర వేడుకలు

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్‌:

గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక జాతీయ వేడుక మాత్రమే కాదు అని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ అన్నారు .యలమంచి ఉదయ్ కిరణ్ నాయకత్వంలో మియాపూర్ మెయిన్ రోడ్ హేమ దుర్గా టెంపుల్ సమీపంలో, అలాగే రాఘవేంద్ర హోటల్ దగ్గర కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ హాజరయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్యం, లౌకికత, సమానత్వ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఆత్మను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే రోజు అని పేర్కొన్నారు. మియాపూర్ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. యువత, మహిళలు, కార్మికులు రాజకీయంగా చైతన్యం చెందాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, గిరి, గౌస్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, అశోక్ గౌడ్, విజయ్, మన్నెపల్లి నరేందర్, ప్రభాకర్, శంకర్, సుబ్బ రాయుడు, గోపినాథ్, వేణు, వీరభద్ర రావు, రాజు, నవీన్, గురువులు, వాసు, ప్రసాద్, నాని, రత్నాచారి, వంశీ, ప్రవీణ్, రాజేశ్, వినోద్, వినయ్, నాగ సాయి, రమేష్, గోపీ, వివేక్, సాయి, గోపాల్, సుభాష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, విద్యార్థులు, యువ నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago