Telangana

సోషలిజం తోనే సమస్యలు పరిష్కారం

శ్రమ దోపిడీ, కుంభకోణాలు చేస్తేనే ఆస్తులు పెరుగుతాయి

మేడే వారోత్సవాల ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

సోషలిజంతోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లోని చిట్కుల్ గ్రామంలోని లక్ష్మీ నగర్ లో మేడే వారోత్సవాలలో భాగంగా శ్రామిక ఉత్సావ కమిటీ ఆ7ధ్వర్యంలో గత రెండు రోజులుగా మహిళలకు, పిల్లలకు నిర్వహిస్తున్న ఆటల ,పోటీల ముగింపు కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ప్రపంచంలో కష్టపడే కార్మిక వర్గం ఆస్తులు, కష్టజీవుల ఆస్తులు పెరగడం లేదని, శ్రమ దోపిడి చేసే వాళ్లు, కుంభకోణాలు చేసే వాళ్ళ ఆస్తులు మాత్రమే పెరిగిపోతున్నా పెరుగుతాయని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సామెతలు, సూక్తులతోని కష్టజీవులను మభ్యపెడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. కష్టపడే వాళ్ళ ఆస్తులు పెరిగితే కూలీల, కార్మికుల ఆస్తులు పెరగాలి కదా ఎందుకు పెరగటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో శ్రమ దోపిడీ చేసే పెట్టుబడుదరుల ఆస్తులు మాత్రమే పెరుగుతున్నాయని ఆయన అన్నారు, మనదేశంలో ఆదాని, అంబానీల ఆస్తులు శ్రమ దోపిడి వల్లనే పెరిగాయని, కుంభకోణాలు చేసే వాళ్ళ ఆస్తులు కూడా పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, కార్మికుల, ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సోషలిజం లోని అన్ని పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. విద్యా, వైద్యం అందరికీ అందుతుందని, కనీస సౌకర్యాలు అయిన ఇల్లు, గుడ్డ, తిండి కూడా సోషలిజం లోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు, అంతే కాకుండా అన్ని రకాల దోపిడీ నుంచి సోషలిజం లోనే విముక్తి లభిస్తుందన్నారు.ఎంజే,ఈ కార్యక్రమంలో శాంత కుమార్, ఆంజనేయులు ,రాజు, యేసు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago