Telangana

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రస్తుత వేసవి కాలంలో కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలని జలమండలి అధికారులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కాంప కార్యాలయంలో అమీన్పూర్ సర్కిల్, పటాన్‌చెరు సర్కిల్ జలమండలి అధికారులతో తాగునీటి పంపిణీ పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆటంకాలు లేకుండా తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సరిపడ నీరు అందించలేని పక్షంలో నూతన బోర్లు వేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. నూతన కాలనీలకు సైతం మంచినీటి సరఫరా అందించేందుకు పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై జలమండలి అండి అశోక్ రెడ్డితో సైతం చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సరఫరా తీరుపై సమీక్షించాలని కోరారు. మంచినీటి పంపిణీ పై ప్రజల నుండి ఫిర్యాదులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు. పాడైన బోర్లు, పైపులైన్‌ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఇందుకు అధికారులు స్పందిస్తూ..ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వడం, నిల్వ ట్యాంకుల శుభ్రపరిచే పనులు చేపడుతున్నామని వివరించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జలమండలి డీజీఎం లు శివకుమార్, శ్రీనివాసరావు, మేనేజర్లు ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago