_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం
_ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్బండ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను చేత బూని సమైక్యత స్ఫూర్తిని చాటిచెప్పారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ నుండి వందల బుల్లెట్లతో,.జాతీయ జెండాలతో మైత్రి స్టేడియం వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది తో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా జాతీయ జెండాను చేత బూని బుల్లెట్ పై తిరుగుతూ అందర్నీ ఉత్సాహపరిచారు.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను.. బంగారు తెలంగాణగా నిర్మించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలీకృతులయ్యారని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దారని అన్నారు.
గంగ జమునా తేహజీబ్ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత కల్లోలాలను రెచ్చగొడుతూ, పచ్చని తెలంగాణను విచ్చిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి చరమగీతం పాడుతారని అన్నారు.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…