_మోడీ మొండివైఖరి పై వెల్లువెత్తిన నిరసన
_పటాన్చెరులో నల్లజెండా ఎగురవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నల్ల జండా ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిస్తున్న చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు నిరంతర పోరాటాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…