politics

దేశం కోసం ఏదో ఒకటి చేయండి… – డాక్టర్ బుద్ధా

మనవార్తలు ,పటాన్ చెరు:

మన దేశ పౌరులు , లేదా అధ్యాపకులు … ప్రతి ఒక్కరూ దేశం కోసం తమకు చేతనైన సాయం ఏదో ఒకటి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ముఖ్య సమన్వయాధికారి డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు . గీతం డీమ్డ్ : విశ్వవిద్యాలయం , హెద్దరాబాద్ లోని అధ్యాపకులు , విద్యార్థులతో శనివారం ఆయన సమావేశమయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రతి ఒక్క అధ్యాపకుడు కొంత సమయాన్ని పేదల కోసం కేటాయించి వారికి విద్యా బుద్ధులు నేర్పాలని కోరారు . ఆంగ్లేయుల విద్యా విధానం మనని పనివారిగానే చేసిందని , వారు విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల కొద్దిమంది ఉన్నత వర్గాల పౌరులకు మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు . మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇప్పటికీ ఆంగ్ల మాధ్యమం గ్రామీణ యువతకు పెద్ద సవాలుగానే ఉందన్నారు . దానిని అధిగమించడం కోసం కొద్దిమంది ఔత్సాహికులతో కలిసి తాము ఆంగ్ల మాధ్యమంలోని పుస్తకాలను 12 భారతీయ భాషలలోకి తర్జుమా చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు .

అలాగే రెత్తులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా భాష అడ్డంకి కాని విధంగా సాఫ్ట్వేరు అభివృద్ధి చేశామని , ఓ తెలుగు రెత్తు అధిక ధర లభించే ఏ రాష్ట్రంలోని వారికెనా తమ ఉత్పత్తులను అమ్ముకునేలా చేస్తున్నట్టు చెప్పారు . ఉమ్మడి కుటుంబాలు నుంచి చిన్న కుటుంబాలకు మారినా , ఆయా వ్యక్తుల మధ్య తగినంత సంభాషణ కొనసాగడంలేదని , బాంధవ్యాలు ఉండడంలేదని , వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో రోజులో కనీసం ఓ గంట అయినా మనసు విప్పి మాట్లాడాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు . అందరూ తమ దేశం హితం కోసం యోచించి , పురోభివృద్ధి వెపు అడుగులేస్తే మన దేశం అభివృద్ధి చెందుతున్నదిగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన అభిలషించారు .

మనదేశంలోని విద్యా విధానానికి , వాస్తవ నెపుణ్యాలకు మధ్య అంతరం చాలా ఉందని , ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బంగారు పతకం పొందిన విద్యార్థి చిన్న ప్యాన్ను రిపేరు చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందని , దానిని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు . నెపుణ్యం గల యువతను మనం తయారు చేయగలిగితే కనీసం ఐదు శాతం నిరుద్యోగితను తగ్గించగలమని , అంటే దాదాపు ఐదు కోట్ల మంది భవిష్యత్తును మార్చగలమని చెప్పారు . మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తాము ఆ దిశగా అనేక చర్యలు చేపట్టామని , వాటికి ఉన్నత విద్యా సంస్థల చేయూత కూడా లభిస్తే మన దేశాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలమని చెప్పారు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె . దలాల్ మాట్లాడుతూ , విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి ఉద్యోగాలు ఇచ్చే దశకు చేరాలని అభిలషించారు . ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే కేవలం 10 నుంచి 15 శాతం పెట్టుబడి ఉంటే చాలని , మిగతా సొమ్ము బ్యాంకుల రుణంగా సమకూర్చుకోవచ్చ న్నారు . మనదేశానికి వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలు 40 నుంచి 45 శాతం ఎగుమతులు చేస్తున్నట్టు చెప్పారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ , మన జాతీయ స్థూల ఉత్పత్తిలో దాదాపు 60 శాతం ఎంఎస్ఎంఈల నుంచే జరుగుతోందన్నారు . విద్యార్థులకు థియరీ బోధించే కంటే ప్రాక్టికల్గా వారితో చేయిస్తూ నేర్పితే మంచి జ్ఞానం వస్తుందని చెప్పారు . అతిథి డాక్టర్ చంద్రశేఖర్ను ఆయన సత్కరించారు . ఇస్కాన్కు చెందిన రాధా ప్రమోదాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago