Districts

క్యాన్సరు ముందుగానే గుర్తించాలి – గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ శ్రీభరత్

మనవార్తలు ,పటాన్ చెరు:

ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఆరు నెలలు లేదా ఓ ఏడాది ముందుగా గుర్తించేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గీతం అధ్యక్షుడు ఎం . శ్రీభరత్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ముగిసింది . ఆ ఉత్సవానికి సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ , క్యాన్సర్ చాలా ప్రమాకరమైన వ్యాధని , అది ప్రజలను కబళిస్తోందని , క్యూమో థెరపీ వంటి చికిత్సలున్నా పాక్షికంగానే రోగులు బయటపడుతున్నారని , కానీ రేడియేషన్ ప్రభావం దీర్ఘకాలం వారిని వేధిస్తోందని విచారం వెలిబుచ్చారు . అసలు ఆ రోగం వచ్చే లక్షణాలను ముందుగానే పసిగట్ట గలిగితే చాలామందిని ప్రజలను కాపాడగలిగిన వారమవుతామని , విస్తృత చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదని శ్రీభరత్ అన్నారు . సమస్యలను పరిష్కరించాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థులు చాలా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని , కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు .

రేడియేషన్ మన జీవితంలో ఓ భాగమని , అన్నిరకాల రేడియేషన్లు హానికరం కాదని , దాని రక్షణ సూత్రాలను అర్థం చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని భాభా అణు పరిశోధనా కేంద్రంలోని రేడియేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె.కె.భరద్వాజ్ కోరారు . ‘ రేడియేషన్ టెక్నాలజీ ఇన్ పాలిమర్ సెన్సైస్’పై ఆయన ఉపన్యసించారు . రేడియోధార్మికత , రేడియోధార్మిక పదార్థాలు విద్యుత్ ఉత్పత్తి నుంచి ఔషధాలు , పరిశ్రమలు , వ్యవసాయంలో వినియోగిస్తున్నామని , ఇది ఒకరకంగా బహుళ ప్రయోజకారిగా ఆయన అభివర్ణించారు . ‘ రేడియోయాక్టివిటీని నిర్వహించడంలో భద్రతా అంశాల’పై బార్క్ పూర్వ శాస్త్రవేత్త , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు ఉపన్యసించారు .

అంతకు మునుపు , ఆయన డాక్టర్ భరద్వాజను సత్కరించారు . గీతం ఈ ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కార్యశాల సదస్యుల మనన్ననలను చూరగొంది . బార్క్ శాస్త్రవేత్తలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియేషన్ గురించి , అణు ప్రతిచర్యలు , ఆరోగ్య సంరక్షణ , ఆహార పరిశ్రమలో ఐసోటోప్ల వినియోగం వంటి ఎన్నో విలువైన విషయాలను వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమాలన్నింటిలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతినిధులు , విద్యార్థులను ధ్రువీకరణ పత్రాలతో పాటు విలువెన పుస్తకాలను పంపిణీ చేశారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , బార్క్ శాస్త్రవేత్త డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago