Districts

క్యాన్సరు ముందుగానే గుర్తించాలి – గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ శ్రీభరత్

మనవార్తలు ,పటాన్ చెరు:

ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఆరు నెలలు లేదా ఓ ఏడాది ముందుగా గుర్తించేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గీతం అధ్యక్షుడు ఎం . శ్రీభరత్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ముగిసింది . ఆ ఉత్సవానికి సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ , క్యాన్సర్ చాలా ప్రమాకరమైన వ్యాధని , అది ప్రజలను కబళిస్తోందని , క్యూమో థెరపీ వంటి చికిత్సలున్నా పాక్షికంగానే రోగులు బయటపడుతున్నారని , కానీ రేడియేషన్ ప్రభావం దీర్ఘకాలం వారిని వేధిస్తోందని విచారం వెలిబుచ్చారు . అసలు ఆ రోగం వచ్చే లక్షణాలను ముందుగానే పసిగట్ట గలిగితే చాలామందిని ప్రజలను కాపాడగలిగిన వారమవుతామని , విస్తృత చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదని శ్రీభరత్ అన్నారు . సమస్యలను పరిష్కరించాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థులు చాలా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని , కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు .

రేడియేషన్ మన జీవితంలో ఓ భాగమని , అన్నిరకాల రేడియేషన్లు హానికరం కాదని , దాని రక్షణ సూత్రాలను అర్థం చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని భాభా అణు పరిశోధనా కేంద్రంలోని రేడియేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె.కె.భరద్వాజ్ కోరారు . ‘ రేడియేషన్ టెక్నాలజీ ఇన్ పాలిమర్ సెన్సైస్’పై ఆయన ఉపన్యసించారు . రేడియోధార్మికత , రేడియోధార్మిక పదార్థాలు విద్యుత్ ఉత్పత్తి నుంచి ఔషధాలు , పరిశ్రమలు , వ్యవసాయంలో వినియోగిస్తున్నామని , ఇది ఒకరకంగా బహుళ ప్రయోజకారిగా ఆయన అభివర్ణించారు . ‘ రేడియోయాక్టివిటీని నిర్వహించడంలో భద్రతా అంశాల’పై బార్క్ పూర్వ శాస్త్రవేత్త , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు ఉపన్యసించారు .

అంతకు మునుపు , ఆయన డాక్టర్ భరద్వాజను సత్కరించారు . గీతం ఈ ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కార్యశాల సదస్యుల మనన్ననలను చూరగొంది . బార్క్ శాస్త్రవేత్తలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియేషన్ గురించి , అణు ప్రతిచర్యలు , ఆరోగ్య సంరక్షణ , ఆహార పరిశ్రమలో ఐసోటోప్ల వినియోగం వంటి ఎన్నో విలువైన విషయాలను వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమాలన్నింటిలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతినిధులు , విద్యార్థులను ధ్రువీకరణ పత్రాలతో పాటు విలువెన పుస్తకాలను పంపిణీ చేశారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , బార్క్ శాస్త్రవేత్త డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago