Telangana

యువతి,యువకులు భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా

-వైద్యం అందరికీ అందుబాటులో కొస్తేనే దేశాభివృద్ధి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

-సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

స్వతంత్ర పోరాట యోధుడు, విప్లవ వీరుడు నవతరానికి స్ఫూర్తి అయినా భగత్ సింగ్ ను యువతి, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా అన్నారు. పటాన్ చెరు పట్టణం లోని శ్రామిక్ భవన్ లో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆమేధా ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను యువతి యువకులు ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయాల కోసం అందరూ ఆలోచించాలని, చైతన్యం కావాలన్నారు.స్వతంత్రం కోసం చిన్న వయసులోనే ఉరితాడుతో ఊయలు లూగిన వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు ఆనాడు స్వతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వేల పదిమంది ఆశయాలు ఈరోజు వరకు కూడా నెరవేరట్లేదని స్వతంత్రం దేశ ములో ప్రజల సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం దారుణమన్నారు.

స్వతంత్ర పోరాట ఫలాలు అందరికీ అందే వరకు యువతీ యువకులు ఉద్యమాలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారులు బడా పెట్టుబడుదలగా మారుతున్నారని ఆయన అన్నారు పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోల్పోయే ప్రమాదంలో దేశం ఉందని దీనిని ప్రజలందరూ గమనించాలని,స్వతంత్ర పోరాట ఫలాలు అందరికీ అందే వరకు ఉద్యమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ పెంటయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య మాట్లాడుతూ విద్య వైద్యం పేదలందరికీ పాలకులే ఉచితంగా అందించాలని ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని అటువైపు అందరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ముందుకు పోతుందని దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఉత్పత్తి జరుగుతుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, నాగేశ్వరరావు, అర్జున్, సురేష్, రామకృష్ణ, సిఇ బాబు, నర్సింలు అమేధా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago