ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా దాడులు
భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం
బ్రిటిష్ తెల్ల దొరల నుండి భారతదేశ విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప పోరాట వీరుడు భగత్ సింగ్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం దాడులు చేస్తుందని భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ పేర్కొన్నారు.భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో బిపిఎల్ చౌరస్తా వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాల నుండి భారతదేశ విముక్తి కోసం 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రాణ బలిదానం చేసిన గొప్ప విప్లవ వీరుడు భగత్ సింగ్ అన్నారు.. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజు గురు సుకుదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని అన్నారు. వారు దేశం కోసం ప్రాణాలర్పించిన యువకిశోరాలని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం వస్తేనే సరిపోదని, ప్రజలందరికీ కూడు,గుడ్డ,గూడు,విద్య,వైద్యం అందాలని కోరుకున్నాడని గుర్తు చేశారు. కానీ నేడు పాలకులు అనుసరిస్తున్న విధానాలతో నిరుద్యోగం పేదరికం దారిద్ర్యం తాండవిస్తుందని ఆరోపించారు. సమానత్వం కుల రహిత సమాజం కోసం భగత్ సింగ్ కన్న కలలు నెరవేరలేదని, అవి సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యమవుతుందని భగత్ సింగ్ నమ్మారని అన్నారు.. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం లాగానే నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని కుటీల ప్రయత్నం చేస్తుందని, అందుకోసమే అనేక దేశాల మీద దాడులు చేస్తుందని విమర్శించారు. భారతదేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని విమర్శించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటం నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కిర్బీ, పార్లే, ఎనర్జీ, సువెన్ యూరోపియన్లు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రాజు శాంత కుమార్ ఇండస్ట్రియల్ క్లస్టర్ నాయకులు జైపాల్, వెంకటేష్, దుర్గేష్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…