Telangana

గీతంలో పరిశోధనా పద్ధతులపై కార్యశాల

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సోషల్ సైన్సెస్ లో ‘పరిశోధనా పద్ధతుల’పై పదిరోజుల కార్యశాలను ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి అత్యుత్తమ పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలు పెంపొందించేందుకు లక్షించారు.సమర్థవంతమైన పరిశోధన ప్రణాళిక, అమలు, విశ్లేషణకు సంబంధించి సమగ్ర అంతర్దృష్టులతో పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సును రూపొందించారు. ఇందులో పాల్గొనేవారు క్రమబద్దమైన సాహిత్య సమీక్షలు, పరిశోధన రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ పద్ధతులు, నైతిక పరిశీలనలు, అవసరమైన సాఫ్ట్ వేర్ సాధనాలతో ఆచరణాత్మక శిక్షణ పొందుతున్నారు.పరిశోధనను బాధ్యతాయుతంగా నిర్వహించడం, వివిధ రకాల సమాచార విశ్లేషణ, పరిశోధనా రూపకల్పన, సాంకేతిక శిక్షణ, నమూనా పరిణామం నిర్దారణ, అనులేఖనం, సమాచర సేకరణ వివరాలు పొందుపరచే విధానాలపై సదస్యులకు మంచి అవగాహన ఏర్పరచనున్నారు.

పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో వక్తలుగా పాల్గొని తమ అనుభవాలు, పరిశోధనా పద్ధతులపై పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ నుంచి ప్రొఫెసర్ ఆర్.కె.మిశ్రా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, ఓపీ జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ రూపేష్ కుమార్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటికి చెందిన డాక్టర్ శివోహం సింగ్, వీఎన్ఆర్ విజ్జాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ నుంచి డాక్టర్ నిత్య సుందర్ నందా వంటి పలువురు విద్యావేత్తలు ప్రధాన వక్తలుగా ఆయా ఎంపిక చేసిన అంశాలపై ప్రసంగిస్తూ, పరిశోధక విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

మనదేశంలోని పలు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 30 మంది పరిశోధక విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని, తమ పరిశోధనా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన నైపుణ్యాలను అలవరచుకుంటున్నారు.ఈ కోర్సు సహ సంచాలకుడు డాక్టర్ మనోజ్ కుమార్ పర్యవేక్షణలో, డాక్టర్ కె.రఖా, డాక్టర్ శోభా మిశ్రాలు సమన్వయం చేస్తున్నారు. ఈ కోర్సు కేవలం నేర్చుకునే మెథడాలజీల గురించి మాత్రమే కాకుండా నైతిక పరిశోధన పద్ధతులు, మెథడాలాజికల్ కఠినత యొక్క సంస్కృతిని పెంపొందించడం గురించి కూడా విశదపరుస్తోందని కార్యశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తెలియజేశారు. సాంఘిక శాస్త్రాల రంగానికి అర్థవంతంగా దోహదపడే తదుపరి తరం పరిశోధకులను అభివృద్ధి చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. వచ్చే గురువారం ఈ కార్యశాల ముగింపు వేడుక నిర్వహించి, ఆసక్తిగా పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలను పంపిణీ చేయనున్నారు.

admin

Recent Posts

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

21 hours ago

గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…

21 hours ago

మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…

21 hours ago

యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…

1 day ago

సివిల్ ఇంజనీరింగ్ లో అహ్మద్ మిన్హాజుద్దీన్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

3 days ago

ప్రజల నిర్ణయమే ఫైనల్

అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…

3 days ago