Categories: politics

గీతమ్ లో కృత్రిమ మేథపై కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిము మేథ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రెండు రోజుల జాతీయ కార్యశాలను మార్చి 27-28 తేదీలలో నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ మోతహర్ రెజా సోనువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. కృత్రిమ మేథ, నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎమ్ఎల్ పీ ), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)లో కీలకమైన భావనలు, వాటిని స్వయంగా వినియోగించే విధానంపై ఇందులో పాల్గొనేవారికి సమగ్ర అవగాహన కల్పించడం ఈ వర్క్ షాప్ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. కృత్రిము మేథ, ప్రాథమిక సూత్రాలు, సాంకేతికతలు, ఆధునిక సమాజంలో దాని ప్రాముఖ్యత, వివిధ రంగాలలో వాస్తవ-ప్రపంచ అనువర్తనాలపై లోతైన అవగాహన పొందుతారన్నారు. అంతిమంగా, కృత్రిమ మేథ, ఎల్ఎల్ఎంలను వారి సంబంధిత రంగాలలో సమర్థంగా ప్రభావితం చేయడానికి, ఆవిష్క రణ, సమస్య-పరిష్కార ప్రయత్నాలకు దోహదపడేందుకు అవసరమైన నై పుణ్యాలు పొందే వీలుందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సిబా: ఉద్దత, ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ అనిమేష్ ముఖర్జీ, జియో ప్లాట్ఫారమ్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ డాక్టర్ ఆకాంక్ష కుమార్, ఐఐటీ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ మానేంద్ర శంకర్ దేశార్కర్, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ రాధిక మామిడి, గీతం నుంచి ప్రొఫెసర్ సయంతన్ నుండల్ ప్రధాన వక్తలుగా పాల్గొంటారని తెలిపారు. కృత్రిమ మేథ, డేటా సైన్స్ చదివే బీటెక్/ ఎంటెక్/ ఎమ్మెస్సీ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థుల కోసం ఈ కార్యశాలను రూపొందించామన్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈనెల 26 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల కోసం సమన్వయకర్తలు డాక్టర్ కె.కృష్ణ 99080 85343, డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి 9849317334 0 dkummari(@gitam.edu, mdoodipa@igitam edus

గీతమ్ కు డీఆర్ డీవో పరిశోధనా ప్రాజెక్ట్

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కనక దుర్గా భాస్కర్ యమజాలకు రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో) నుంచి 42.90 లక్షల పరిశోధనా ప్రాజెక్టు మంజూరైంది . ‘ఎన్- మిథెల్ ప్లాయ్- 5- వినెల్ టెట్రాజోల్ ఎనర్జిటిక్ బెండర్ కలిగిన ఆక్సిరేట్ యొక్క సింథటిక్ రూట్ అభివృద్ధి’ చేయడానికి ఈ గ్రాంటును కేటాయించినట్టు తెలియజేశారు.డీఆర్ డీవో పరిశోధనా ప్రాజెక్టును సాధించిన డాక్టర్ భాస్కర్ను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద. సిద్ధవట్టం అభినందించి, గడువులోగా దానిని పూర్తిచేయమని సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

15 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago