పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రముఖ కళాకారిణి డాక్టర్ నీనా ప్రసాద్ మోహినియాట్టం నృత్య ప్రదర్శన ఆసొంతం మనోహరంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఈ ప్రదర్శనను స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ సహకారంతో స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించింది.గురువుకు నివాళిగా చొల్కెట్టుతో శాస్త్రీయ నృత్య పారాయణం ప్రారంభమైంది. తర్వాత వసుంధర సుందర ధార భూమి ప్రదర్శన గాత్రానికి తగ్గ అభినయంతో అలరించింది. ఆ తరువాత ప్రతిభా రే రచించిన పద వర్ణన’తో కొనసాగి, తిల్లానా’తో ముగిసి, ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేసింది.మాధవన్ సంపూత్రి సీపీ (గానం), రమేష్, బాబు కేపీ (మృదంగం), అరుణ్ దాస్ సీపీ (ఇడక్క), కోలంక సాయికుమార్ (వయోలిన్) తదితరులు డాక్టర్ వీనా ప్రసాద్ కు సహకారం అందించారు.మోహినియాట్టం పారాయణం వంటి కార్యక్రమాల ద్వారా మనదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం గీతం, హైదరాబాద్ కొనసాగిస్తోంది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…