పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ (జీఎస్బీ); నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 31 తేదీన ‘ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్’ పై రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన ఈ వర్క్షాప్ను తిరిగి ఈ నెలాఖరున నిర్వహించనున్నట్టు జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనేవారి నైపుణ్యాలు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్ ప్ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు, వారిని నిజ-సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు.సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం.అరవింద్, క్యాపిటల్ మార్కెట్ ని ఎస్ఎంఈ ఎల్.కన్నన్, గీతం అధ్యాపకులు తను విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ ఎన్. రూపలత 98481 17823ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…