_ప్రజల నమ్మకంతోనే హ్యాట్రిక్ విజయం సాధించాం
_ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
యాదవుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో గల గోకుల్ ఫంక్షన్ హాలులో పటాన్చెరు యాదవ సంఘం ఆధ్వర్యంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్నేతలని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే విజయం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…