పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మత్స్య సంపదలో తెలంగాణ అగ్రస్థానంగా ఉందని పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఫిషర్ సొసైటీ అధ్యక్షులు సుంకర బోయిన మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలాల వారిగా మృత్యు సొసైటీ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పటాన్ చెరువు మండల అధ్యక్షుడిగా శ్రీ ఆకుల శివకృష్ణకు నియామకపత్రాన్ని స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ఉపాధిగా ఉన్న చెరువులను కుంటలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షించి మత్స్యకారుల జీవనోపాధి కలిగే విధంగా ప్రత్యేకంగా చొరవ చూపాలని ,మత్స్య సంపదను అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించగలరని శ్రీ ఆకుల శివకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపకులు పిట్టల రవీందర్ ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు నీలం లత, ఉపాధ్యక్షురాలు పూజల పురం వీరేష్, ప్రధాన కార్యదర్శిగా చింతల వీరేష్ ,అమీన్పూర్ మండల అధ్యక్షులుగా మన్నే రాములు, రామచంద్రపురం మండల అధ్యక్షులుగా బాలకృష్ణ, కంది మండల అధ్యక్షుడు కృష్ణ ,పటాన్చెరు మండల అధ్యక్షులు శ్రీ ఆకుల శివకృష్ణ (చంటీ ) ముదిరాజ్, మరియు మస్తకార సంఘ సభ్యులు ఫిషరీస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…