Telangana

మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాది పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల

అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకుంటున్న నేటితరం మహిళలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలుస్తున్న చేనేత రంగం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పటాన్ చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గీత వెంకట్ అధ్యక్షతన. జరిగిన సమావేశంలో లావణ్య మధునాల మాట్లాడుతు. చేనేత రంగంలో చేనేత మహిళల కృషి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. నేటికీ దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలు నూలు వడకడం,బట్టలు నేయడం వంటి పనుల్లో నిమగ్నమై తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నారన్నారు.చేనేత మహిళలు తమ నైపుణ్యం, శ్రమతో అందమైన వస్త్రాలను తయారు చేస్తూ సంప్రదాయ కళను నిలబెడుతున్నారని, వారి కృషి వల్ల చేతితో నేసిన వస్త్రాలకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగాను మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేనేత మహిళలకు అవసరమైన మద్దతు, శిక్షణ మరియు మార్కెట్ అవకాశాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతారని, శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని,కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు మహిళలు తమ ప్రతిభ, కృషి, సహనంతో గొప్ప విజయాలను సాధిస్తున్నారని అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదని, ప్రతి మహిళకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యతగా గుర్తుతెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షురాలు సంగీత, జి.చంద్రకళ, కె.చంద్రకళ, నర్సమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago