రేపు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఎమ్మెల్యే జిఎంఆర్ గారు గూడెం యాదమ్మ గారితో కలిసి స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు పట్టణం వేదికగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యం కుటుంబ నిర్వహణ, ఉద్యోగం వంటి బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉండే మహిళల కోసం క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని మహిళలందరూ వేడుకల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, హారిక విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…