– కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహిళలు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలరని విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అన్నారు.గురువారం పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి విశ్వభారతి లా కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవాని మాట్లాడుతూ… ఇంటికి ఇల్లాలే దీపం అనేది పాత మాటని… నేడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదున్నుగా ఉండటమే కాకుండా ఆకాశమే తమవసం కావాలనట్లుగా మహిళలు పాటుపడుతున్నారని కొనియాడారు. సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఉందని అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. లింగ బేధం లేకుండా పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.మహిళా అధ్యాపకులు కళాశాల అభివృద్ధికి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి యొక్క సేవలు తమ కళాశాలకు ఎంతో అభినందనీయమని మహిళా దినోత్సవం సందర్భంగా శాలువ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వర్ష, రమ్య ,కీర్తి, అన్వి, పూనం, తేజశ్రీ, గురుమూర్తి, అంబర్ తదితాలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…