పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల మొక్కలను నాటి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొన్నందుకు ఈ గుర్తింపు లభించినట్టు తెలిపారు. ఈ అవార్డును గత ఏడు సంవత్సరాలుగా గీతం అందుకుంటూ, పర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను చాటి చెబుతోందన్నారు.పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలో విద్యార్థులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని డీవీవీఎస్ఆర్ వర్మ హర్షం వెలిబుచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…