Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ రాకతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది..

వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు

పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటించాడు

ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా పటన్ చేరు అధ్యక్షుడు కోల్కురి నరసింహారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోటు లేదని పార్టీ అధిష్టానం నిర్ణయాలకు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని.. అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం పై దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు, ఐ ఎన్ పి యు సి జిల్లా అధ్యక్షులు కోలుకూరి నరసింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పటాన్చెరులో ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందని అన్నారు.

పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చిన్న ప్రతి పిలుపులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని జయప్రదం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారి పుటీన రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సిఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారికి నివాళులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో సైతం కాంగ్రెస్ పార్టీ జిన్నారం గుమ్మడి దల నాయకులు సమాచారం అందించి వారితోనే పాల్గొన్నారని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ పార్టీలో చేరడానికి జీర్ణించుకోకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను బలి చేయడం సరికాదని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ మాజీ డైరెక్టర్ ప్రమోద్ ఆతిక్ మాజీ ఎంపీటీసీ వెoకటేష్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago