వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…
-తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
– వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
-పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు
-వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్:
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.
కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా విభాగానికి నోటీసులు జారీ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ విధానం వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.కేంద్రం నిర్ణయంతో వాట్సప్ తన నిర్యాన్ని ప్రకటించి యూజర్ల ప్రైవసీ కాపాడుతుందా? లేక తన పాలసీ ప్రకారం లేళ్లుతుందా అనేది చూడాలి .ప్రస్తుతానికి తమ ప్రైవసీ వాయిదా వేసుతున్నట్లు ప్రకటించి తప్పించుకోవాలని చుసిన వాట్సప్ పై కేంద్రం గట్టిగానే హెచ్చరికలు జారీచేసింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…