మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో గల శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు జి హెచ్ ఎం సి ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైట్ ఫీల్డ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మెరుకు మంగళవారం రోజు కాలనీ లో పాదయాత్ర నిర్వహించారు.వైట్ ఫీల్డ్ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారుఅని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై రోడ్డు విస్తరణ కై తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి తెలుసుకున్నారు. సాఫ్ట్ వెర్ ఉద్యోగులు,పాఠశాలల కు, కళశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రోడ్డు ఆక్రమణ ల పై ఉక్కుపాదం తో తొలగిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని,ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని పేర్కొన్నారు. వైట్ ఫీల్డ్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామనీ, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని,రోడ్లు, డ్రైనేజి, స్ట్రీట్ లైట్స్ మరియు ఇతర మౌలిక వసతుల పై అసోసియేషన్ సభ్యులతో చర్చించడం జరిగినది అని అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి గాని తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పనులు పై అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, అవసరమున్న చోట రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈ ఈ. గోవర్ధన్, డి.ఈ. దుర్గాప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఎసిపి. కరుణాకర్, టిపిఎస్ సంతోష్, డి ఈ.రూపదేవి, ఏ ఈ. మన్యం, ఎస్ ఆర్ పి కిరణ్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…