రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం
మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ
అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త ఊపిరి పోస్తూ పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక, ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.గురువారం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి, నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 సంవత్సరాల క్రితం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి దశలవారీగా నిధులు మంజూరు చేస్తూ మార్కెట్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.ప్రస్తుతం 21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.ప్రస్తుతం మార్కెట్కు పన్నులు, కిరాయిలు, టెండర్ల ద్వారా ఏటా సుమారు రూ.6 కోట్ల ఆదాయం సమకూరుతోందని, దీనిని మరింత పెంచేందుకు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డులో ఆధునిక మేకల మండి, చేపల మార్కెట్, అత్యాధునిక స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే రోజువారీ కూరగాయల విక్రయాలు నిర్వహించే చిరు వ్యాపారులకు ప్రత్యేక షెడ్లు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ స్వంత ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన, నంబర్-1 మార్కెట్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కార్యదర్శి సునీల్, మాజీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యాపారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…