గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న అధ్యాపకులను తీర్చిదిద్దే చైతన్యవంతమైన కేంద్రంగా గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను రూపొందించినట్టు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు. హైదరాబాదు లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కొత్తగా రూపొందించిన అధ్యాపకుల గదులు, విద్యార్థుల కోసం నెలకొల్పిన కంప్యూటర్ ల్యాబ్ ను అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆయా ప్రదేశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ రిచా శర్మ మాట్లాడుతూ, ఈ కొత్త మౌలిక సదుపాయాల వెనుక ఉన్న దార్శనికతను వివరించారు. విద్యాపరమైన సహకారాన్ని, అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులను తీర్చిదిద్దుతున్నట్టు తెలియజేశారు. వినూత్నమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా గీతం యొక్క బహుళ విషయక విద్యా సంస్కృతిని బలోపేతం చేయడానికి తమ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కట్టుబడి ఉందన్నారు.
జాతీయ విద్యా విధానం-2020 దార్శనికతకు అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి రెండు నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను (ఐటీఈపీ) ప్రారంభించనున్నట్టు కూడా డాక్టర్ రిచా శర్మ ప్రకటించారు. విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణతో అనుసంధానించేలా బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులను రూపొందించినట్టు తెలియజేశారు. బలమైన బోధనా నైపుణ్యాలు, తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు, సమకాలీన విద్యా పద్ధతులపై విద్యార్థులు లోతైన అవగాహనను పెంపొందించుకుంటూ, సైన్స్, గణితం, ఆంగ్లం లేదా సాంఘిక శాస్త్రాలలో ప్రత్యేకత సాధిస్తారని ఆమె వివరించారు.వ్యక్తిగత మార్గదర్శనం, ఉన్నత-నాణ్యత గల విద్యా ప్రమాణాలను నిర్ధారించడానికి, ఒక్కో కోర్సులో 50 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని డాక్టర్ రిచా శర్మ వెల్లడించారు. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.
నిష్పక్షపాతమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తరఫున జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సీ.ఆర్.టీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆమె స్పష్టీకరించారు.స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపనతో, భవిష్యత్తు తరగతి గదులను తీర్చిదిద్దగల సమర్థవంతమైన, దూరదృష్టి గల విద్యావేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, విద్యాపరమైన శ్రేష్ఠత, ఆవిష్కరణల పట్ల గీతం తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తోందన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ లతో పాటు పలువురు డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ…
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 6వ ఎడిషన్ను టైమ్స్ ఆఫ్ ఇండియా,…
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…
నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…
- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…