Telangana

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న అధ్యాపకులను తీర్చిదిద్దే చైతన్యవంతమైన కేంద్రంగా గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను రూపొందించినట్టు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు. హైదరాబాదు లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కొత్తగా రూపొందించిన అధ్యాపకుల గదులు, విద్యార్థుల కోసం నెలకొల్పిన కంప్యూటర్ ల్యాబ్ ను అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆయా ప్రదేశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ రిచా శర్మ మాట్లాడుతూ, ఈ కొత్త మౌలిక సదుపాయాల వెనుక ఉన్న దార్శనికతను వివరించారు. విద్యాపరమైన సహకారాన్ని, అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులను తీర్చిదిద్దుతున్నట్టు తెలియజేశారు. వినూత్నమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా గీతం యొక్క బహుళ విషయక విద్యా సంస్కృతిని బలోపేతం చేయడానికి తమ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కట్టుబడి ఉందన్నారు.

జాతీయ విద్యా విధానం-2020 దార్శనికతకు అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి రెండు నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను (ఐటీఈపీ) ప్రారంభించనున్నట్టు కూడా డాక్టర్ రిచా శర్మ ప్రకటించారు. విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణతో అనుసంధానించేలా బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులను రూపొందించినట్టు తెలియజేశారు. బలమైన బోధనా నైపుణ్యాలు, తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు, సమకాలీన విద్యా పద్ధతులపై విద్యార్థులు లోతైన అవగాహనను పెంపొందించుకుంటూ, సైన్స్, గణితం, ఆంగ్లం లేదా సాంఘిక శాస్త్రాలలో ప్రత్యేకత సాధిస్తారని ఆమె వివరించారు.వ్యక్తిగత మార్గదర్శనం, ఉన్నత-నాణ్యత గల విద్యా ప్రమాణాలను నిర్ధారించడానికి, ఒక్కో కోర్సులో 50 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని డాక్టర్ రిచా శర్మ వెల్లడించారు. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.

నిష్పక్షపాతమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తరఫున జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సీ.ఆర్.టీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆమె స్పష్టీకరించారు.స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపనతో, భవిష్యత్తు తరగతి గదులను తీర్చిదిద్దగల సమర్థవంతమైన, దూరదృష్టి గల విద్యావేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, విద్యాపరమైన శ్రేష్ఠత, ఆవిష్కరణల పట్ల గీతం తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తోందన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ లతో పాటు పలువురు డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

15 hours ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

1 day ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

1 day ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

2 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

2 days ago

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

4 days ago