ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ
ఈడీ ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న మోదీ
నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియా,రాహుల్ పై ఈడి చార్జిషీట్ అన్యాయం
ప్రజాక్షేత్రంలో బీజేపీ సంగతి తేల్చుతాం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడి కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఈడి ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అడ్డగోలుగా బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ వ్యాపారస్తులకు మద్దతునిస్తూ వారిని దేశం దాటిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను నిండా ముంచుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకుల పై తప్పుడు కేసులు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుల పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…