Telangana

కక్ష్యపూరిత రాజకీయాలకు తెరదించుతాం నీలం మధు ముదిరాజ్

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ 

ఈడీ ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న మోదీ

నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియా,రాహుల్ పై ఈడి చార్జిషీట్ అన్యాయం

ప్రజాక్షేత్రంలో బీజేపీ సంగతి తేల్చుతాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడి కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఈడి ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అడ్డగోలుగా బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ వ్యాపారస్తులకు మద్దతునిస్తూ వారిని దేశం దాటిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను నిండా ముంచుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకుల పై తప్పుడు కేసులు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుల పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago