Telangana

కక్ష్యపూరిత రాజకీయాలకు తెరదించుతాం నీలం మధు ముదిరాజ్

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ 

ఈడీ ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న మోదీ

నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియా,రాహుల్ పై ఈడి చార్జిషీట్ అన్యాయం

ప్రజాక్షేత్రంలో బీజేపీ సంగతి తేల్చుతాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడి కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఈడి ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అడ్డగోలుగా బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ వ్యాపారస్తులకు మద్దతునిస్తూ వారిని దేశం దాటిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను నిండా ముంచుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకుల పై తప్పుడు కేసులు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుల పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago