Telangana

ఉన్నత పాఠశాలలో ‘బ్రదర్ హుడ్ డే’

సామాజిక అవగాహనను ప్రోత్సహించడానికి నిర్వహించిన గీతం స్టూడెంట్స్ క్లబ్ చరైవేతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రుద్రారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘బ్రదర్ హుడ్ డే’ని ఇటీవల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి విభాగం చరైవేతి నిర్వహించింది. గీతం ఆతిథ్య విభాగం ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, బాలల మనస్సులో సామాజిక అవగాహన, ఐక్యత, కరుణను పెంపొందించేందుకు లక్ష్యించారు.ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా, నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి మహేశ్వర మెడికల్ కళాశాల వైద్యుల సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అక్కడే దంత పరీక్షలు జరిపి, మంచి నోటి సంరక్షణ పద్ధతులపై వారికి అవగాహన కల్పించారు.బాలల వ్యక్తిగత భద్రత, శరీర స్వయం ప్రతిపత్తి వంటి సున్నితమైన అంశాలను విడమరిచి చెప్పారు. తమను తాము రక్షించుకోవడానికి, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి అవసరమైన జ్జానాన్ని వారికి వివరించి, మంచి స్పర్శ, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. విద్యార్థులందరికీ ఉపయోగపడే స్టేషనరీ కిట్లు, శీతల పానీయాలను పంపిణీ చేశారు.మొత్తం మీద ఈ కార్యక్రమం, గీతం యొక్క సమగ్ర విద్య, సమాజ శ్రేయస్సుకు నిదర్శనంగా నిలిచి, పాఠశాల బాలలపై శాశ్వత ముద్ర వేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago